ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు

ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
  •     సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో మీడియా సెంటర్, ఎం‌‌సీఎంసీ కేంద్రాన్ని అడిషనల్  కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో  కలిసి ఆయన  ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్నికల సమాచారం మీడియాకు  సెంటర్ ద్వారా అందజేస్తామన్నారు.  ఈ కేంద్రం ద్వారా జిల్లాకు సంబంధించిన పెయిడ్ న్యూస్, ఫిర్యాదులు వాటి సమస్యలు పరిశీలించడం, డెయిలీ పేపర్లలో  వచ్చే వార్తలు, ఎలక్ట్రానిక్, కేబుల్ ప్రకటనలు పరిశీలన చేస్తామని తెలిపారు.

ALSO READ: లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయాలి : కలెక్టర్ ఆర్.వి కర్ణన్

జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలవారీగా ఎన్నికల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.  మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ  ఏ.రమేశ్​కుమార్, డీఈఐఈ మల్లేశం, సీపీఓ వెంకటేశ్వర్లు, సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, ఏఓ సుదర్శన్ రెడ్డి, తదితరులు 
పాల్గొన్నారు.