బీఆర్‌‌‌‌ఎస్‌‌పై ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేస్తం: జి.నిరంజన్​

బీఆర్‌‌‌‌ఎస్‌‌పై ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేస్తం: జి.నిరంజన్​

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ హామీలపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ ఓ ఫేక్‌‌ బుక్‌‌ లెట్‌‌ను విడుదల చేశారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ను ప్రజలు అధికారానికి దూరం పెట్టడాన్ని ఈ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వివర్శించారు.

తమ పార్టీ గుర్తు మీద 420 అని ముద్రించేంత ధైర్యం ఎక్కడిదని మండిపడ్డారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేసి, బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేయాలని కోరుతామన్నారు. రాజకీయాల్లో విలువలను కాపాడాలంటే ఇలాంటి పార్టీలను రద్దు చేయాలన్నారు.