సినీ నటి తాప్సీ పన్నుపై కేసు నమోదు

సినీ నటి తాప్సీ పన్నుపై కేసు నమోదు

సినీ నటి తాప్సీ పన్నుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా, అశ్లీతను వ్యాప్తి చేసేలా ప్రదర్శన ఇచ్చారని పేర్కొంటూ హింద్ రక్షక్ సంఘటన్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సినీ నటి తాప్పీపై బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు కంప్లైంట్ నమోదైంది. మార్చి 12న ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాప్సీ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారని, అందులో భాగంగా ఆమె అసభ్యకరమైన దుస్తులు ధరించారని ఆరోపించారు. అంతే కాకుండా ఆమె లక్ష్మీ దేవి లాకెట్ ను కలిగిన నెక్లెస్ ధరించారన్నారు. అది హిందూ దేవుళ్లను అవమానించినట్టేనని, లక్ష్మీ దేవిని కించపరిచారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మార్చిన 12 ముంబైలో జరిగిన ఈ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న తాప్సీని గత కొన్ని రోజుల నుంచి  ట్రోల్ చేస్తున్నారు. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఆమె వేసుకున్న దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరేమో ఆమె వేసుకున్న నెక్లెస్ పై అభ్యంతరం చెబుతూ.. లక్ష్మీ దేవిని, హిందూ దేవుళ్లను కించపరిచేలా, అశ్లీతను వ్యాప్తి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. తాజాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడంతో సినీ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.