- సింగరేణి జూనియర్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో నాంపల్లి పీఎస్లోనూ కేసు
అబిడ్స్, వెలుగు: చెన్నూరు బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని డీసీసీ ఖైరతాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. ఆయనను వెంటనే అరెస్ట్చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సింగరేణి కార్యాలయాలు, రైల్వే లైన్లు తగలబెట్టాలని, హింసాత్మక చర్యలకు పాల్పడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమైనవని పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్చేయాలని సీఐ పరశురాంను కోరారు.
అలాగే, సింగరేణిలో మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ ఇన్స్పెక్టర్ బి.ఆనంద్ బుధవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులకు నష్టం చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మందమర్రి డివిజన్ లో ప్రోగ్రాం పెట్టి, జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని సుమన్ బీఆర్ఎస్కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. అలాగే, నాంపల్లిలోని సింగరేణి భవన్ ను తగలబెట్టి, ఆగం చేయాలని ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూనియర్ఇన్స్పెక్టర్ఫిర్యాదు మేరకు బాల్క సుమన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
