రూ.10 కాయిన్లు తీసుకుంటలేరని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఆందోళన

రూ.10 కాయిన్లు తీసుకుంటలేరని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఆందోళన

కాగజ్​నగర్, వెలుగు: పది రూపాయలు కాయిన్స్ తీసుకోవట్లేదంటూ ఓ వ్యక్తి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మోగడ్ దగడ్ గ్రామానికి చెందిన గోగర్ల పద్మాకర్ గ్రాడ్యుయేట్. కరోనా ఎఫెక్ట్ తో సిటీలో జాబ్ పోవడంతో కుటుంబ పోషణకు సొంతూరు వచ్చి కూరగాయలు అమ్మాడు. కొద్ది రోజుల్లో 1100 పది రూపాయల కాయిన్స్ జమయ్యాయి. వ్యాపారులెవరూ వాటిని తీసుకోలేదు. చివరికి బ్యాంకులో మార్చుకుందామని వెళ్లగా అన్నింటినీ తీసుకోలేమన్నారు. దీంతో  పద్మాకర్ గురువారం కౌటాల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కాయిన్స్ పోసి నిరసన తెలిపాడు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు.