ఉద్యోగాల కోసం TSPSC ఆఫీస్ ముందు బీజేపీ యువ మోర్చా నేతల ఆందోళన

ఉద్యోగాల కోసం TSPSC ఆఫీస్ ముందు బీజేపీ యువ మోర్చా నేతల ఆందోళన

హైదరాబాద్ : TSPSC ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ యువ మోర్చా నేతలు. బీజేపీ కార్యాలయం నుంచి  TSPSC  ఆఫీస్ వరకు  ర్యాలీగా వెళ్లిన  నేతలు  నిరసన తెలిపారు. TSPSC  ఆఫీస్ ముందు ర్యాలీని  అడ్డుకున్న పోలీసులు…  భారీ కేడ్లు,  ముళ్లకంచలు  ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో  వాగ్వాదానికి  దిగారు నేతలు.  దీంతో  వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… పీఎస్ కు తరలించారు. రాష్ట్రంలో  ఖాళీగా  ఉన్న 2 లక్షల  ఉద్యోగాలకు  వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని  డిమాండ్ చేశారు  బీజేపీ యువ  మోర్చా నేతలు.. నిరుద్యోగ  భృతిని ప్రకటించాలన్నారు. సర్కార్  నిరుద్యోగులను  మోసం చేసిందని  మండిపడ్డారు.