
ఆదిలాబాద్ జిల్లా: హాస్పిటల్ కి వచ్చిన రోగులు తమ ఇండ్ల ముందే ఉంటున్నారని స్థానికులు గొడవకు దిగారు. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని.. భుక్తాపూర్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉన్న నక్షత్ర కోవిడ్ హాస్పిటల్ కు రోజూ కరోనా పేషెంట్లు అధిక సంఖ్యలో వస్తున్నారని.. హాస్పిటల్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హాస్పిటల్ దగ్గరకు చేరుకుని కాలనీవాసులకు నచ్చజెప్పారు. అయినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు. జనావాసాల్లో కరోనా ట్రీట్ మెంట్ కి అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. దీంతో కరోనా పేషంట్, వారి సహాయకులను ఆసుపత్రి గేటు లోపలికి పంపించారు పోలీసులు.