నల్గొండలో ఎంపీపీ, ఎంపీడీవోకు మధ్య వాగ్వాదం

నల్గొండలో ఎంపీపీ, ఎంపీడీవోకు మధ్య వాగ్వాదం

MPP ముత్తిలింగయ్య వేధిస్తున్నాడని నల్లగొండ జిల్లా కట్టంగూర్ MPDO సునీత కంటతడి పెట్టుకున్నారు. సర్వసభ్య సమావేశాన్ని సీసీ కెమెరా పర్యవేక్షణలో నిర్వహించే విషయంలో MPDO సునీత, MPP ముత్తిలింగయ్య మధ్య గొడవ జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న MPP రిక్వెస్ట్ ను తిరస్కరించారు MPDO సునీత.  దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకూడదనే జీవో ఉంటే చూపించాలని MPP ముత్తిలింగయ్య కోరారు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎంపీడీవో తోపాటు వివిధ శాఖల అధికారులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. MPP వ్యవహారశైలిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు అధికారులు..