నా తండ్రి వీఆర్ఏ ఉద్యోగం నాకివ్వాలి...మంత్రి సత్యవతి ముందు ఆత్మహత్యాయత్నం

నా తండ్రి వీఆర్ఏ ఉద్యోగం నాకివ్వాలి...మంత్రి సత్యవతి ముందు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏ నియామక పత్రాల పంపిణీలో గందరగోళం నెలకొంది. తన పోస్టును వేరే వారికి కేటాయించడంతో ఓ వ్యక్తి  ఆత్మహత్యకు యత్నించాడు. నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన షేక్ సలీం.. తనకు వచ్చిన పోస్టును వేరేవారికి ఇచ్చారని తీవ్ర మనస్థాపంతో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. 

 తన తండ్రి హుస్సేన్ ఉద్యోగం అర్హత లేని వారికి కేటాయించడంతో షేక్ సలీం మనస్తాపానికి గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన యాకుబ్ పాషాకు ఉద్యోగం కేటయించడంతో ఆందోళన వ్యక్తం చేసిన అతడు.. షేక్ సలీం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు.  

నెల్లికుదురు మండల డిప్యూటీ తహశీల్దార్ తరంగిణి డబ్బులు తీసుకొని యాకుబ్ పాషాకు పోస్టింగ్ కేటాయించారని షేక్ సలీం ఆరోపించాడు. తన వారసత్వ ఉద్యోగం తనకు ఇవ్వాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.