కేరళ : బంగారం అక్రమ రవాణా కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరువనంతపురంలో కాంగ్రెస్ యువజన కార్యకర్తలు నిరసన చేపట్టారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలంటూ సచివాలయం ఎదుట ఆందోళనలు చేశారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
#WATCH | Police use water cannons to disperse Youth Congress workers who are protesting outside Secretariat in Thiruvanathapuram demanding resignation of Kerala CM Pinarayi Vijayan in a gold smuggling case pic.twitter.com/71bfZJ20Tl
— ANI (@ANI) June 18, 2022
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ జూన్ 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
Kerala gold smuggling case accused Swapna Suresh summoned by ED to appear on June 22 for the probe.
— ANI (@ANI) June 18, 2022
(file pic) pic.twitter.com/Vs2cL9t62R
మరోవైపు.. కొచ్చిలోనూ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఇక్కడ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
#WATCH | Kerala | Police use water cannons to disperse BJP Yuva Morcha workers who are protesting in Kochi demanding the resignation of Kerala CM Pinarayi Vijayan in a gold smuggling case pic.twitter.com/ChyhNXn7au
— ANI (@ANI) June 18, 2022
మరోవైపు ... జూన్ 13న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు విమాన ప్రయాణంలో ఊహించని సంఘటన ఎదురైంది. యూత్ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. ఇద్దరు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్ వారిని తోసేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో జరిగింది.
#WATCH | Kerala: Youth Congress workers protest in Thiruvananthapuram and demand the resignation of CM Pinarayi Vijayan over the gold smuggling case. pic.twitter.com/FCtlvuTfam
— ANI (@ANI) June 18, 2022
బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం, ఆయన కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారికి కూడా ఇందులో భాగం ఉందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.
30 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ తో పాటు సందీప్ నాయర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్ లో స్వప్న సురేష్ విడుదలయ్యారు.