
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, విహెచ్, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య చేతుల మీదుగా కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
బీసీ డిక్లరేషన్ లోని అంశాలు:
- స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంపు.
- బీసీలకు రాజకీయంగా మరిన్నీ అవకాశాలు.
- ప్రతి మండలంలో బీసీలకు ప్రత్యేక గురుకులాలు.
- ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు.
- 50ఏళ్లు దాటిన పద్మశాలీలకు పించన్ సౌకర్యం.
- మహాత్మ జ్యోతి బాపులే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్లు.
- జిల్లా కేంద్రాల్లో బీసీలకు ప్రత్యేక భవనాలను నిర్మాణం.
- విశ్వకర్మలు, మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
- గద్వాల్, సిరిసిల్ల, నారాయణ్ ఖేడ్ లో పవర్ లూమ్స్ ఏర్పాటు
- రజకుల కోసం రూ.10 లక్షల సబ్సిడీ.
- కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.
- వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రూ.10 లక్షల రుణం సాయం.
- జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ పెంపు
- వైన్స్ టెండర్లలో గౌడ్స్ రిజర్వేషన్ మరింత పెంపు