కాంగ్రెస్​ ఎలక్షన్.. అబ్జర్వర్లుగా దీప, సిరివెళ్ల

కాంగ్రెస్​ ఎలక్షన్..  అబ్జర్వర్లుగా దీప, సిరివెళ్ల

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంతోపాటు త్వరలో ఎలక్షన్స్ జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ హైకమాండ్​అబ్జర్వర్లను నియమించింది. ఇందులో తెలంగాణకు సీనియర్ అబ్జర్వర్​గా దీప దస్మున్షి, అబ్జర్వర్​గా డా.సిరివెళ్ల ప్రసాద్ ను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) వేణుగోపాల్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. 

వెస్ట్ బెంగాల్​కు చెందిన దీప దస్మున్షి.. 2012–2014 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రిగా సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా, అంతకు ముందు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఏపీకి చెందిన డా. సిరివెళ్ల ప్రసాద్ ఏఐసీసీ సెక్రటరీ, తమిళనాడు ఇన్​చార్జ్​గా ఉన్నారు. వీరితో పాటు రాజస్థాన్​కు సీనియర్ అబ్జర్వర్​గా మధుసూదన్ మిస్త్రీ, అబ్జర్వర్​గా ససికాంత్ సెంతిల్, మధ్య ప్రదేశ్ సీనియర్ అబ్జర్వర్​గా రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా, అబ్జర్వర్​గా చంద్రకాంత్ హ్యాండోర్, చత్తీస్​గఢ్​ సీనియర్ అబ్జర్వర్​గా ప్రీతంసింగ్, అబ్జర్వర్​గా మీనాక్షి నటరాజన్, మిజోరాం అబ్జర్వర్​గా సచిన్ రావును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు.