అందుబాటులో ఉండి హామీలన్నీ నెరవేరుస్తా : చంద్రశేఖర్

అందుబాటులో ఉండి హామీలన్నీ నెరవేరుస్తా : చంద్రశేఖర్
  •    మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్

జహీరాబాద్, వెలుగు : నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్, లోకల్ బాడీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు శాయ శక్తుల కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్​నేత హరీశ్ రావు ఆటలు ఇక సాగవన్నారు.

కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలుచేస్తామన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు.  సమావేశంలో కాంగ్రెస్​ నాయకులు ఉజ్వల్ రెడ్డి, హన్మంతరావు పటేల్, ఎంజీ రాములు, శ్రీనివాస రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామలింగారెడ్డి, ఖాజా మియా, హర్షద్ |పాల్గొన్నారు.