హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ కు బీసీని సీఎం చేసే ధైర్యం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య అన్నారు. బీసీ సీఎం అని బీజేపీ ప్రకటించగానే రాహుల్ గాంధీతో పాటు రాష్ర్ట కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. బుధవారం ఆయన బీజేపీ మీడియా సెంటర్ లో మాట్లాడారు.
ఎల్బీ స్టేడియంలో మోదీ మీటింగ్ కు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మ రథం పట్టారని వెల్లడించారు. ఆ సభతో మోదీ పట్ల ప్రజలకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతున్నదని తెలిపారు. బీసీ బిడ్డ అయిన దేవగౌడను ప్రధాని పదవి చేపట్టిన పది నెలలకే తొలగించి.. కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీగా నిరూపించుకుందని బూర నర్సయ్య గుర్తు చేశారు.