పదేండ్లు దోచుకొని.. కాంగ్రెస్​ను 420 అంటరా : బెల్లయ్య నాయక్​

పదేండ్లు దోచుకొని.. కాంగ్రెస్​ను 420 అంటరా : బెల్లయ్య నాయక్​

హైదరాబాద్, వెలుగు :  పదేండ్లు ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్​ నేతలు పాలించారని ఆదివాసీ కాంగ్రెస్​ చైర్మన్​ బెల్లయ్య నాయక్​ విమర్శించారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న మత్తులోనే కేటీఆర్​ మాట్లాడుతున్నారని ఫైర్​అయ్యారు. ఇన్నేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న గాడిద.. కాంగ్రెస్ వి​420 హామీలంటూ మాట్లాడుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్​ రెడ్డితో కలిసి గురువారం గాంధీభవన్​లో బెల్లయ్య నాయక్​ మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి 30 రోజులైనా కాకముందే ఎందుకంత ఫ్రస్ట్రేషన్​ అని ప్రశ్నించారు. కేసీఆర్​ హయాంలో అధికారులు ఎక్కడా పనిచేయలేదన్నారు.  లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం కడితే.. ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని, అప్పుడు కేటీఆర్​ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీకి పనిలేదన్నారు. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.