కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. 2023 శాసన సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పీసీసీ అధ్యక్ష పీఠం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. చివరికి ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి దక్కించుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కానీ ఈ మధ్యనే ఈ ఇద్దరూ నేతలు కలిసిపోయారు. 

మరిన్ని వార్తల కోసం...

స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు

పదేండ్ల V6 జర్నీ