పార్టీ మార్పుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గౌరవం లేనపుడు అభిమానాన్ని చంపుకొని ఇంకా కాంగ్రెస్ లో ఎలా కొనసాగుతానని అన్నారు. ఎంతో భాధ, మదన పడితే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. పార్టీతో నాలుగు దశాబ్ధాల అనుభంధం తెంచుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఉగాది తరువాత తన నిర్ణయాన్నిచెబుతానన్నారు . తాను పార్టీ మారితే ఎమ్మెల్యే సంజయ్ నే కారణమన్నారు. కాంగ్రెస్ కు ఐక్యత జగిత్యాల అని చెప్పారు.
జగిత్యాలలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి. నేను పార్టీ మారితే ఏదో జరుగుతుందని అనుకోవడం లేదు. సమయం సమాధానం చెబుతుంది. నా సమస్యకి పరిష్కారం దొరకడం లేదు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేను వెళ్ళగొడితేనే నా సమస్యకి పరిష్కారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నేను పార్టీ మారితే సంజయ్ కుమారే కారణం. నా సమస్య కి పరిష్కారం వస్తుందని అనుకోవడం లేదు. పార్టీలోని నా మిత్రులు నాతో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడ కారణం. ఆరు గ్యారంటీలలో కొన్ని పథకాలే అమలు అవుతున్నాయి. ఆరు గ్యారంటిలలో కొన్ని అమలు చేయలేక పోయారు. రైతుభరోసా.. తులం బంగారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది అని అన్నారు.
►ALSO READ | జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ నే ప్రశ్నిస్తారా.? కేటీఆర్ కు పొంగులేటి కౌంటర్
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ చేరడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
