హైదరాబాద్, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్, కేటీఆర్భయపడుతున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్పార్టులు ఒక్కటి కాబట్టే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాలేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నెలలోపే ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్దని చెప్పారు.
2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలను చూస్తే బీఆర్ఎస్చరిత్ర తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ ఆర్ఎస్ఎస్మనిషి కాబట్టే ప్రధాని మోదీని విమర్శించడం లేదన్న కేటీఆర్ కామెంట్లు మోసపూరితమైనవని కిరణ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.