కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం

కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది.ఏప్రిల్ 15వ తేదీ సోమవారం  ఆయన తల్లి అనసూయ(85) కున్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో నగరంలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు ఉదయం 8గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో మధుయాష్కి గౌడ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.  

ఆమె పార్దివ దేహాం మధ్యాహ్నం హయత్ నగర్ లోని మధుయాష్కీ ఇంటికి చేరుకోనుంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా,  మధుయాష్కి గౌడ్ తల్లి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.