టీఆర్ఎస్ తో పీకే టీం..మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

టీఆర్ఎస్ తో పీకే టీం..మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వరుస ట్వీట్లు చేశారు.  టీఆర్ఎస్ తో పీకే టీం కలిసి పనిచేయడంపై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.. నీ శత్రువుతో స్నేహం చేసిన వ్యక్తులను నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. మాణిక్యం ఠాగూర్ ట్వీట్లపై తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ చర్చ జరుగుతోంది. నిన్న కేసీఆర్ తో జాతీయ రాజకీయాలపై సుదీర్ఘ మంతనాలు చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇటు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడ్డాయి.  

ప్రశాంత్ కిషోర్ చేరికపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీకే చేరికను పలువురు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన వ్యక్తి నమ్మడానికి వీలు లేదని చెప్తున్నారు. పార్టీ వ్యూహాలను ప్రత్యర్థులకు లీక్ చేసే అవకాశం ఉందని మరికొంత మంది సీనియర్లు వాదిస్తున్నారు. పీకేకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం మాణిక్యం ఠాగూర్ ట్వీట్ ఏఐసీసీలో చర్చనీయాంశంగా మారింది.