తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపుపై సింగరేణిలో సంబురాలు

తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపుపై సింగరేణిలో సంబురాలు

గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల కోల్​బ్లాక్​ 2 మైనింగ్​లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలోని జీఎం ఆఫీస్​, బొగ్గు గనులు, ఓపెన్​ కాస్ట్​పై కార్మికులు నినాదాలు చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీకే 1వ గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్​పాల్గొని మాట్లాడారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రీజియన్ క్వాలిటీ జీఎం సుజోయ్ మజుందార్, ఎస్‌‌‌‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్లయ్య పాల్గొన్నారు. 

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌: బీఎంఎస్ నిరంతర పోరాటం ఫలితంగా తాడిచర్ల బొగ్గు బ్లాక్-2 సింగరేణికి కేటాయించారని సింగరేణి కోల్​మైన్స్​ కార్మిక సంఘ్​(బీఎంఎస్​) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు.  మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణిఖని ఓపెన్​కాస్ట్​ కోల్‌‌‌‌మైన్‌‌‌‌పై బీఎంఎస్​ శ్రేణులు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో బీఎంఎస్​ సెంట్రల్​ వైస్​ ప్రెసిడెంట్​ శ్రీనివాస్​రాజు, మందమర్రి ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ ప్రదీప్​కుమార్,సెక్రటరీ వీరన్న, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ సతీశ్​, లీడర్లు పాల్గొన్నారు.