కుత్బుల్లాపూర్, వెలుగు: కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడి కారుకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బౌరంపేట్కు చెందిన నర్సారెడ్డి వీరారెడ్డి జీపీఆర్ లేఅవుట్లోని తన ఆఫీస్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఆయన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వీరారెడ్డి గట్టిగా అరవడంతో పారిపోయారు.
కారు సగం వరకు కాలిపోయింది. పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించారు. వ్యాపార లావాదేవీలా? లేదా రాజకీయ గొడవలు కారణమా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
