లక్సెట్టిపేట, వెలుగు: ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పీహెచ్సీ పరిధిలోని 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రూ.20 వేల విలువైన పౌష్టికాహార కిట్స్ను ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా ఉప వైద్యారోగ్యశాఖ అధికారి సుధాకర్ నాయక్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సమత, ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన రమేశ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాయలింగు, కోశాధికారి వి.రాజు పాల్గొన్నారు.
