కాంగ్రెస్​ నేతల ఫ్లెక్సీ వార్.. మీడియా ప్రతినిధులపై దాడి

కాంగ్రెస్​ నేతల ఫ్లెక్సీ వార్.. మీడియా ప్రతినిధులపై దాడి

ఉప్పల్​లో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు టీపీసీసీ రేవంత్​రెడ్డి జులై 29 న వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్​నేతల మధ్య అనైక్యత, వర్గపోరు బయటపడింది.రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. 

రేవంత్​రాకను స్వాగతిస్తూ ఏషియన్​ థియేటర్​ వద్ద రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన ఫ్లెక్సీని కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేశారు. ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న రిపోర్టర్లపై సైతం వారు దాడికి పాల్పడ్డారు. 

వెంటపడి మరీ మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని స్థానికులు ఖండించారు. అంతా జరుగుతున్నా పోలీసులు వారిని ఆపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్​పర్యటన వేళ కాంగ్రెస్​ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్న తీరుపై మేడ్చల్​సీనియర్​నేతలు ఆగ్రహంతో ఉన్నారు.