ఉప్పల్లో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు టీపీసీసీ రేవంత్రెడ్డి జులై 29 న వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్నేతల మధ్య అనైక్యత, వర్గపోరు బయటపడింది.రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు.
రేవంత్రాకను స్వాగతిస్తూ ఏషియన్ థియేటర్ వద్ద రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన ఫ్లెక్సీని కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేశారు. ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న రిపోర్టర్లపై సైతం వారు దాడికి పాల్పడ్డారు.
వెంటపడి మరీ మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని స్థానికులు ఖండించారు. అంతా జరుగుతున్నా పోలీసులు వారిని ఆపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్న తీరుపై మేడ్చల్సీనియర్నేతలు ఆగ్రహంతో ఉన్నారు.