కాంగ్రెస్ ‌‌లీడర్లకు తప్పిన ప్రాణాపాయం

కాంగ్రెస్  ‌‌లీడర్లకు తప్పిన ప్రాణాపాయం

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖని పట్టణానికి  చెందిన కాంగ్రెస్​ లీడర్లకు ప్రాణాపాయం తప్పింది.  కాంగ్రెస్​ రామగుండం కార్పొరేషన్​ ఏరియా ప్రెసిడెంట్​ బొంతల రాజేశ్​, గోదావరిఖని పట్టణ అధ్యక్షుడు తిప్పారపు  శ్రీనివాస్, లీడర్లు నాయిని ఓదెలు యాదవ్​, తిరుపతి ఆదివారం హైదరాబాద్​కు వెళుతుండగా శామీర్​పేట దాటిన తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.  

ఎదురుగా మరో వాహనం అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది.  కారులో రెండు ఎయిర్​ బ్యాగ్​లు ఓపెన్​ కావడంతో అందులో ప్రయాణిస్తున్న లీడర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  వారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.