మల్యాల పీఎస్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌పై ఫిర్యాదు

మల్యాల పీఎస్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌పై ఫిర్యాదు

మల్యాల, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌‌‌‌ నాయకులు శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కేటీఆర్‌‌‌‌పై కేసు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై నరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌కు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో సంత ప్రకాశ్‌‌‌‌రెడ్డి, కిషన్‌‌‌‌రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్, కిట్టిరెడ్డి, మహేశ్‌‌‌‌రెడ్డి, వినయ్‌‌‌‌ పాల్గొన్నారు.