బిర్లా టెంపుల్​లో రేవంత్​ పూజలు 

బిర్లా టెంపుల్​లో రేవంత్​ పూజలు 
  • కాంగ్రెస్ ​నేతల ప్రత్యేక పూజలు
  • బిర్లా టెంపుల్, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు 

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ​నేతలు బుధవారం హైదరాబాద్​లోని బిర్లా టెంపుల్​లో ప్రత్యేక పూజలు, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ, పార్టీ సీనియర్​ వైస్ ప్రెసిడెంట్​మల్లు రవి, అంజన్​కుమార్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ పార్టీ గ్యారంటీ కార్డును దేవుళ్ల దగ్గర పెట్టి పూజలు, ప్రార్థనలు చేయించారు. కాగా, పూజల అనంతరం గాంధీ భవన్​లో నేతలందరూ వార్​రూమ్​లో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో బూత్​ లెవెల్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు సూచనలు చేశారు.