రాహుల్ పై దాడికి కాంగ్రెస్ నేతల నిరసనలు

రాహుల్ పై దాడికి కాంగ్రెస్ నేతల నిరసనలు

ఖమ్మం టౌన్, వెలుగు : అస్సాంలో ఏఐసీసీ నాయకులు రాహుల్​గాంధీ పాదయాత్రను బీజేపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ..  కాంగ్రెస్​ నాయకులు సోమవారం స్థానిక ధర్నా చౌక్ నుంచి జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. రాహుల్​ గాంధీ పై జరిగిన దాడిని, ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడిగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు ఎండీ. జావీద్,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, పాల్గొన్నారు. 

మధిర : మధిరలో మండల కాంగ్రెస్​ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్​ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్​ మాట్లాడుతూ రాహుల్​ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాదయాత్రను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో సూర్యాపేట -ఖమ్మం రహదారిపై కాంగ్రెస్​ నాయకులు రాస్తారోఖో నిర్వహించారు. బీజేపి సృష్టిస్తున్న అడ్డుకుల్ని వెంటనే అపాలని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎండీ హాఫీజుద్దీన్, బజ్జూరి వెంకటరెడ్డి, వాసు పాల్గొన్నారు.