తిరుపతిరెడ్డికే టికెట్​ ఇవ్వాలి

తిరుపతిరెడ్డికే టికెట్​ ఇవ్వాలి
  •      భట్టి విక్రమార్కను కలిసిన               
  •      మెదక్​ కాంగ్రెస్ లీడర్లు

మెదక్, వెలుగు : మెదక్​ అసెంబ్లీ  కాంగ్రెస్​ పార్టీ టికెట్​ను డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డికే ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. గురువారం డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు,  కాంగ్రెస్​ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్​రెడ్డి, యూత్​​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మహెందర్​ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార శ్యాంసుందర్, మెదక్​ టౌన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు శంకర్, లక్కర్ శ్రీనివాస్, శామ్ రెడ్డి, లింగం గౌడ్, గోవింద్​ నాయక్

యాదగిరి హైదరాబాద్​ వెళ్లి గాంధీ భవన్​లో భట్టి విక్రమార్కను కలిశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలోపేతానికి కృషి చేసిన తిరుపతి రెడ్డికే టికెట్​ ఇవ్వడం సమంజసమన్నారు.  పార్టీలో చేరకముందే మైనంపల్లి రోహిత్​కు మెదక్ కాంగ్రెస్​ పార్టీ టికెట్​ ఖరారైందన్న ప్రచారం పార్టీ క్యాడర్​ను అయోమయానికి గురి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, శ్రీకాంత్​, సుఫీ పాల్గొన్నారు.