వాళ్ల పంచాయతీ వాటర్ కోసం కాదు వాటాల కోసం

వాళ్ల పంచాయతీ వాటర్ కోసం కాదు వాటాల కోసం

సాగు నీటి హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్, జగన్ పంచాయతీ వాటర్ కోసం కాదనీ.. వాటాల కోసమని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే సంపత్. సంగమేశ్వరంపై తాను అసెంబ్లీలో మాట్లాడితే గెంటేశారని చెప్పారు. ప్రాణాలు కాపాడే నర్సులను కేసీఆర్ సర్కారు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ 300 కోట్లు పంపించాడని ఆరోపించారు. నీళ్ల పంచాయితీ ఓ దుర్మార్గమైన కుట్ర అన్నారు. రాష్ట్ర సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు మల్లురవి.