కర్ణాటకలో పీఎం మోడీ : వేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే

కర్ణాటకలో పీఎం మోడీ : వేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే

కలబుర్గి : కర్ణాటకలోని కలబుర్గిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. కలబుర్గిలో ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సభా వేదికపై ఎమ్మెల్యే డాక్టర్ ఉమేశ్ జాదవ్ కనిపించారు. చించోలి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఆయన గెలుపొందారు. మార్చి 4వ తేదీన ఇటీవలే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లెటర్ రాశారు. ఇపుడు ఆయన.. బీజేపీ శిబిరంలో కనిపిస్తున్నారు. ఈ సభలోనే ఆయన పార్టీలో చేరుతారని చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప సహా.. బీజేపీ కీలకనాయకులు ఈ మీటింగ్ కు వస్తున్నారు.

ఆ తర్వాత తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి…. కాంచీపురంలో రూ.5వేల కోట్లతో నిర్మిస్తున్న ఐదు నేషనల్ హైవేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.