సర్కార్ బడి పిల్లలతో భోజనం చేసిన సీతక్క

సర్కార్ బడి పిల్లలతో భోజనం చేసిన సీతక్క

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్‭ను ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఉదయం స్కూల్‭లో ఫుడ్ పాయిజన్ కావడంతో కిచెన్ రూం, స్కూల్‭ను పరిశీలించారు. స్కూల్ యాజమాన్యం, సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తర్వాత స్కూల్ విద్యార్థులతో కలిసి సీతక్క భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వారి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థుల గురించి ఆందోళన చెందవద్దని సీతక్క చెప్పారు. నాణ్యమైన భోజనం అందించాలని స్కూల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీతక్క హెచ్చరించారు.