గౌరవెల్లి నిర్వాసితులను పరామర్శించిన శ్రీధర్ బాబు

గౌరవెల్లి నిర్వాసితులను పరామర్శించిన శ్రీధర్ బాబు

టీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు గూండాయిజం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. వాళ్లతో పాటు పోలీసులు కూడా గుండాయిజం చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు, గౌరవెల్లి భూనిర్వాసితుల మధ్య తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళలను హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఆయన పరామార్శించారు. మహిళలు అని కూడా చూడకుండా వాళ్లపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈ విధంగా ఉంటాయా అని మహిళలు బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. భూనిర్వాసితుల సమస్యలను సీఎం వెంటనే పరిష్కరించడంతోపాటు సొంత జిల్లా కాబట్టి ఎవరికి ఏమైనా బాధ్యత వహించాలన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని  చెప్పారు.