- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
హైదరాబాద్, వెలుగు: జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ మోసగాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైతులు, ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ అని అన్నారు.
ఆదివారం అసెంబ్లీలో పద్దులపై ఆయన మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయాలని, బడ్జెట్లో దానికి శాంక్షన్ ఇవ్వాలని, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
