కూకట్ పల్లిలో చెరుకు లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

కూకట్ పల్లిలో చెరుకు లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ నుంచి ఎర్రగడ్డకు చెరుకు లోడ్​తో వెళ్తున్న ఈ లారీ.. బీజేపీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

లారీలో  డ్రైవర్​ప్రకాశ్​కూ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం కారణంగా ఉదయం ట్రాఫిక్​కు అంతరాయం కలగగా, పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.