అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, వీరయ్య బడ్జెట్ సమావేశాలను బహిష్కరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలు పాటించకుండా  రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సభలో ప్రతి పక్ష సభ్యులను అగౌరవపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేకుండా చేసి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణ భవన్లా మారిందని ఆరోపించారు.