కేసీఆర్ కుట్రలో పడి ఎన్నికల్లో పోటీచేయొద్దు..

కేసీఆర్ కుట్రలో పడి ఎన్నికల్లో పోటీచేయొద్దు..

కేసీఆర్ కుట్రలో పడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయవద్దని పీవీ కుటుంబాన్ని కోరారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పీవీ కుటుంబంపై ప్రేమ ఉంటే.. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ సీటు ఇవ్వాలన్నారు.టీఆర్ఎస్  పీవీ కుటుంబాన్ని అగౌరవ పరచడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిని నిలబెడుతుందన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి అభ్యర్థులు దొరక్కా..కేసీఆర్ పీవీ వాణిని బరిలో పెట్టారన్నారు. ఓడితే కేసీఆర్ ఖాతాలో కాకుండా పీవీ కుటుంబ ఖాతాలో వేయాలని చూస్తున్నారన్నారు.  దమ్ముంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యులను బరిలో పోటీలో నిలబెట్టాలన్నారు. బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు, వామపక్షాల అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఏనాడు పట్టభద్రుల పక్షాన పోరాడలేదన్నారు.