- కాంగ్రెస్ లీడర్లు
న్యూఢిల్లీ: రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్పందించారు. రాహుల్ ఎప్పుడూ మహిళలను అగౌరవపర్చలేదని, మణిపూర్హింసపై చర్చను అడ్డుకునేందుకే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని లోక్సభ కాంగ్రెస్ విప్ మణిక్యం ఠాగూర్ అన్నారు.
పార్లమెంట్ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని, మహిళా ఎంపీలు, కేంద్ర మంత్రులను చూసి కాదన్నారు. అధికార పార్టీ సభ్యలకు రాహుల్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. దాన్నుంచి ఆమె బయటపడేందుకు ప్రయత్నించాలని సూచించారు.
మహిళలంటే రాహుల్కు ఎంత గౌరవమో భారత్ జోడో యాత్ర చూస్తేనే అర్థం అవుతుందని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొందరు మనసులో ఏదో పెట్టుకుని.. ఏదో ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాహుల్ను అపార్థం చేసుకున్నారని, అది వారి సమస్య అని, రాహుల్ది కాదన్నారు. నఫ్రత్ కా బజార్మే మొహబ్బత్కి దుకాన్ తెరవబడిందనేది రాహుల్ సందేశమని తెలిపారు.