పాలమూరు జిల్లాలో కాంగ్రెస్​ నేతల్లో సంబురం

పాలమూరు జిల్లాలో కాంగ్రెస్​ నేతల్లో సంబురం

సీఎంగా రేవంత్​రెడ్డిని కాంగ్రెస్​ హైకమాండ్​ ఖరారు చేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో సీఎంగా పాలమూరు బిడ్డ రేవంత్​రెడ్డిని ప్రకటించడంతో పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక రేవంత్​రెడ్డిని హైదరాబాద్​ క్యాంప్​లో ఉన్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి శివకుమార్​రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలాఉంటే కోస్గి పట్టణ నాయకులు వార్ల విజయకుమార్, నాగులపల్లి నరేందర్, సురేశ్​రెడ్డి, అన్నా కిష్టప్ప, మున్సిపల్  వైస్  చైర్ పర్సన్  అన్నపూర్ణ హరికుమార్, ఆసిఫ్​ తదితరులు రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్​ నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతి రెడ్డిని కలిసి విషెస్​ చెప్పారు.