హాలియా సభకు కాంగ్రెస్ సన్నాహాలు

హాలియా సభకు కాంగ్రెస్ సన్నాహాలు

నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమరంలో దూకుడు పెంచాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కాంగ్రెస్ పని అయిపోయింది అన్న ప్రచారాలకు తెరపడేలా చేయడానికి.. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలపై నాగార్జునసాగర్ లోని జానారెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ జరిగింది. ఉప ఎన్నిక పై జానారెడ్డితో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు.  ఈ సందర్భంగా సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 న హాలియా లో జనగర్జన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేస్తామన్నారు. ఈ నెల 29 జానారెడ్డి  నామినేషన్  వేస్తారని వివరించారు.