లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి, అంజన్ కుమార్

లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి, అంజన్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌చార్జిలు కత్తి వెంకటస్వామి, అంజన్‌‌కుమార్‌‌‌‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని, భవిష్యత్తులో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటాలన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, జున్ను రాజేందర్, దుర్గయ్య, మహేశ్‌‌, తదితరులు పాల్గొన్నారు.