చేవెళ్ల గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సునీతారెడ్డి

చేవెళ్ల గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:  సునీతారెడ్డి

వికారాబాద్, వెలుగు : పార్టీకి యూత్ కాంగ్రెస్  వెన్నెముకలా పనిచేస్తుందని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ నేత, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి పేర్కొన్నారు.  వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంతోశ్ ​ఆధ్వర్యంలో వికారాబాద్ టౌన్ లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా ఆమె  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకులు చాలా అవసరమన్నారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  యువ ఓటర్లపై  ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని అధిష్టానం కచ్చితంగా గుర్తిస్తుందని చెప్పారు. చేవెళ్ల పార్లమెంటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ చార్జ్ గా ఉన్నారని, ఈ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యూత్ కాంగ్రెస్ ను  బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత కృష్ణం రాజు, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్  కార్యకర్తలు పాల్గొన్నారు.