కాంగ్రెస్ కు 3.. మజ్లిస్కు 2...ఖరారైన నిజామాబాద్ మున్సి పల్ కోఆప్షన్ పదవులు

కాంగ్రెస్ కు 3.. మజ్లిస్కు 2...ఖరారైన నిజామాబాద్ మున్సి పల్ కోఆప్షన్ పదవులు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ కోఆప్షన్​ పదవుల ఎంపిక పూర్తయింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​మూడు, మజ్లిస్​రెండు స్థానాలు గెలుచుకుంది. జనరల్​కోటాకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కాంగ్రెస్​నుంచి బీసీ వర్గానికి చెందిన బొబ్బిలి మాధురి, కల్లెడ అశోక్ విజయం సాధించగా.. మజ్లిస్ ​నుంచి ముజీబ్​అహ్మద్​ గెలిచారు. 

మైనార్టీ కోటాకు రిజర్వ్ చేసిన రెండు సీట్లలో  సిక్కు వర్గానికి చెందిన సర్దార్​నరేందర్​సింగ్​కాంగ్రెస్​ నుంచి, మజ్లిస్​ నుంచి ఉజ్మా గెలుపొందారు.  కోఆప్షన్ ​పదవులతో కార్పొరేషన్​లో కాంగ్రెస్, మజ్లిస్ బలం మరింత పెరిగింది. పదవులు పొందిన వారిలో బొబ్బిలి మాధురి గతంలో  కార్పొరేటర్​గా పనిచేశారు. నరేందర్​సింగ్​రెండోసారి కోఆప్షన్​పదవి దక్కించుకోగా రూరల్ సెగ్మెంట్​పరిధి నుంచి అశోక్ ఎన్నికయ్యారు. 

మజ్లిస్ పార్టీ నగర జనరల్​ సెక్రటరీ ముజీబ్​ అహ్మద్​ రెండోసారి కోఆప్షన్​పదవి పొందగా ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేషన్​ఎన్నికల్లో టికెట్​దక్కని బాడీ బిల్డర్​ అజ్వత్​ ఖాన్​భార్య ఉజ్మాకు కోఆప్షన్​పదవి ఇచ్చారు. మేయర్​ఉమారాణి అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక సమావేశానికి ఎక్స్​అఫీషియో సభ్యుల హోదాలో ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​, రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్​లో 28 మంది కార్పొరేటర్లున్న బీజేపీ కోఆప్షన్ ఎన్నికలకు హాజరు కాలేదు.