మై బేబీ.. మై డార్లింగ్: జైలు నుంచే చిలిపి ల‌వ్ లెట‌ర్​

మై బేబీ.. మై డార్లింగ్: జైలు నుంచే చిలిపి ల‌వ్ లెట‌ర్​

ప్రేమ దూరాల్ని చెరిపేస్తుంది.  ప్రేమించిన వారు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగానే ఉంటారంటున్నాడు సుకేష్​ చంద్రశేఖర్. ఇంతకు ఈయన ఎవరనుకుంటున్నారా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. 

బాలీవుడ్​ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(చంద్రశేఖర్​ ప్రియురాలు) పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జైలు నుంచే ప్రేమ లేఖ రాశాడు. అది కాస్తా సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తరువాతి పుట్టిన రోజు తనతో కలిసి జరుపుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాసిన లెటర్​లో ఈ విధంగా ఉంది. 

'నా బేబీ జాక్వెలిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు, నా బిడ్డకు దేవుడి ఆశీర్వాదం తప్పక ఉంటుంది. నిజానికి, నా పుట్టినరోజు కంటే ఎక్కువగా నీ బర్త్డేని భావిస్తాను.  నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను పంపుతున్న ఈ బర్త్‌డే గిఫ్ట్ నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. బంగారం, వజ్రం, ముత్యాలు ఎన్ని ఉన్నా నిన్ను సంతోషపెట్టవని నాకు తెలుసు. ప్రస్తుతం నీనుంచి దూరంగా ఉన్నా మన మధ్య ఉన్న  జ్ఞాపకాలను బొమ్మలుగా వేసి లెటర్​ తోపాటు పంపించాను. అవి ఎలా ఉన్నాయో చెప్పు. ఈ భూమిపై మనల్ని ఎవరూ విడదీయలేరు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజును మన బిడ్డతో కలిసి చేసుకుందాం.  పుట్టినరోజు శుభాకాంక్షలు నా హనీబీ. హ్యావ్ ఎ బ్లాస్ట్. లవ్ యూ' అంటూ ముగించాడు. 

అయితే సుకేష్​తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని గతంలో బిజినెస్​ విషయంలోనే తాను అతన్ని కలిసినట్లు జాక్వెలిన్​ చెప్పడం గమనార్హం.