ప్రేమ దూరాల్ని చెరిపేస్తుంది. ప్రేమించిన వారు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగానే ఉంటారంటున్నాడు సుకేష్ చంద్రశేఖర్. ఇంతకు ఈయన ఎవరనుకుంటున్నారా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(చంద్రశేఖర్ ప్రియురాలు) పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జైలు నుంచే ప్రేమ లేఖ రాశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తరువాతి పుట్టిన రోజు తనతో కలిసి జరుపుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాసిన లెటర్లో ఈ విధంగా ఉంది.
'నా బేబీ జాక్వెలిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు, నా బిడ్డకు దేవుడి ఆశీర్వాదం తప్పక ఉంటుంది. నిజానికి, నా పుట్టినరోజు కంటే ఎక్కువగా నీ బర్త్డేని భావిస్తాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను పంపుతున్న ఈ బర్త్డే గిఫ్ట్ నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. బంగారం, వజ్రం, ముత్యాలు ఎన్ని ఉన్నా నిన్ను సంతోషపెట్టవని నాకు తెలుసు. ప్రస్తుతం నీనుంచి దూరంగా ఉన్నా మన మధ్య ఉన్న జ్ఞాపకాలను బొమ్మలుగా వేసి లెటర్ తోపాటు పంపించాను. అవి ఎలా ఉన్నాయో చెప్పు. ఈ భూమిపై మనల్ని ఎవరూ విడదీయలేరు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజును మన బిడ్డతో కలిసి చేసుకుందాం. పుట్టినరోజు శుభాకాంక్షలు నా హనీబీ. హ్యావ్ ఎ బ్లాస్ట్. లవ్ యూ' అంటూ ముగించాడు.
అయితే సుకేష్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని గతంలో బిజినెస్ విషయంలోనే తాను అతన్ని కలిసినట్లు జాక్వెలిన్ చెప్పడం గమనార్హం.