డ్యూటీలో ఉండగా విషాదం
కాగజ్నగర్, వెలుగు: గుండెపోటుతో డ్యూటీలోనే ఓ కానిస్టేబుల్కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కెరమెరి మండలం దేవాపూర్కు చెందిన రాథోడ్ మనోజ్కుమార్(27) 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. గత ఏడాది ఏప్రిల్నుంచి కౌటాల పోలీస్స్టేషన్లో డ్యూటీ చేస్తున్నాడు. ఏడాది క్రితం జీవితతో వివాహమైంది. ఎప్పటిలానే బుధవారం రాత్రి 8 గంటలకు వాచ్డ్యూటీ కానిస్టేబుల్గా బాధ్యతలు చేపట్టాడు. రాత్రి క్రికెట్మ్యాచ్ను తోటి కానిస్టేబుల్తో కలిసి చూశాడు. అర్ధరాత్రి 12 తర్వాత డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో చనిపోయాడు.
గురువారం ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు మనోజ్సెట్కాన్ఫరెన్స్అటెండ్ చేయకపోవడంతో హెడ్కానిస్టేబుల్ రమేష్ అతడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. అయితే నోటి నుంచి కొద్దిగా రక్తం పడి ఉండటంతో పాటు శరీరానికి చీమలు పట్టడంతో వెంటనే కౌటాల సీఐ శ్రీనివాస్కు సమాచారం అందించారు. సీఐ వచ్చి చూసి అప్పటికే మనోజ్కుమార్చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు.
రాత్రి డ్యూటీ లేకుంటే…
రాత్రి డ్యూటీ లేకుంటే తన భర్త ప్రాణాలు నిలిచేవని, ఇప్పుడు తన జీవితం ఎటు కాకుండా ఆగమైందని, భర్త ప్రాణాలు తెచ్చివ్వాలంటూ కానిస్టేబుల్భార్య జీవిత సివిల్ఆస్పత్రి వద్ద జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి కాళ్లు పట్టుకొని ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. మనోజ్కుమార్కుటుంబానికి అన్ని విధాల శాఖపరంగా సాయం అందిస్తామని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని బెనిఫిట్స్వెంటనే ఇప్పిస్తామని, కుటుంబంలో ఒకరికి 15 రోజుల్లో జాబ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు.