ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు :  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు :  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి
  • పటాన్‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి

అమీన్‌‌పూర్‌‌‌‌(పటాన్​చెరు), వెలుగు: నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని, డివిజన్​ పరిధిలోని పార్కుల సుందరీకరణ చేపడుతున్నట్లు సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి తెలిపారు. ఆదివారం డివిజన్​ పరిధిలోని ఆల్విన్‌‌కాలనీ, శాంతినగర్​ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పార్కుల అభివృద్ధికి రూ.37లక్షలు కేటాయించినట్లు చెప్పారు.

-అనంతరం వివిధ మసీదుల్లో ప్రభుత్వం అందించిన రంజాన్​ కానుకలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ కుమార్‌‌‌‌యాదవ్‌‌, లీడర్లు విజయ్​కుమార్, నరసింహారెడ్డి, నర్రా భిక్షపతి, అంజిరెడ్డి, షకీల్​, రాజు, వెంకటేశ్​, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.