జైపూర్: జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ భారీ కంటెయినర్ అదే రోడ్డుపై వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి కారుమీద పడిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయిపోగా.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు క్షణాల్లో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం పాలి జిల్లాలోని గుండోజ్ నుండి సిరోహి వైపు వెళ్లే మార్గంలో గుడా ఆండ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని బాలరాయ్ ప్రాంతంలో జరిగిందీ ప్రమాదం. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు.. జోధ్ పూర్ కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న దంపతులు అశ్నిదేవ్ ఆయన భార్య రశ్మిదేవ్, మరొకరు అజ్మీర్ మెడికల్ కాలేజీ ఆర్ధిక సలహాదారు మనోజ్ శర్మ, డ్రైవర్ బుద్ధీరామ్ గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. కారుపై పడిన కంటెయినర్ ను పక్కకు జరపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ జరగని ఘటన కావడంతో భారీ క్రేన్ ను తెప్పించి అతి కష్టం మీద కంటెయినర్ ను పక్కకు జరిపారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. జిల్లా ఎస్పీ రావత్ ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతదేహాల వెలికితీతను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గుండోజ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారుపై పడ్డ కంటెయినర్..నలుగురి మృతి
- దేశం
- April 3, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం