ఒంటరిగానే పోటీ : మమతా బెనర్జీ

ఒంటరిగానే పోటీ : మమతా బెనర్జీ

కోల్‌‌కతా: కాంగ్రెస్​కు బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో టీఎంసీ అభ్యర్థి ఓడిపోవడంపై స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు. ‘‘కాంగ్రెస్,- సీపీఎం, బీజేపీ అనైతిక పొత్తు వల్లే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్​కు పడేలా కుట్ర చేశారు” అని ఆరోపించారు.

కాగా, కాంగ్రెస్ అభ్యర్థి బేరోన్ బిశ్వాస్ చేతిలో  టీఎంసీ అభ్యర్థి దేబాశిష్ ఓడిపోయారు. దీనిపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘పోలీసుల అండతో ప్రజలను పీడించి గతంలో టీఎంసీ గెలిచింది. ఈసారి మేం విజయఢంకా మోగించాం. మాకు ఇకపై అన్నీ విజయాలే” అని అన్నారు.