- గత నెల రోజుల్లో కేజీకి రూ. 10 వరకు తగ్గుదల
- ఇంకో రూ. 3‑4 తగ్గుతుందంటున్న ఎస్ఈఏ
న్యూఢిల్లీ: వంట నూనె ధరలు గత నెల రోజుల్లో కేజీపై రూ. 8–10 వరకు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడంతోనే రేట్లు దిగొచ్చాయని పేర్కొంది. మరోవైపు దేశంలో నూనెగింజల ప్రొడక్షన్ పెరగడం, గ్లోబల్గా వంటనూనె ధరలు తగ్గుతుండడంతో రానున్న నెలల్లో వీటి రేట్లు కేజీపై మరో రూ. 3–4 తగ్గుతాయని ఎస్ఈఏ అంచనావేసింది. పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని వంట నూనె ధరలను తగ్గించాలని దీపావళి ముందు అసోషియేషన్లోని కంపెనీలను కోరామని ఎస్ఈఏ గుర్తుచేసింది. ‘ఈ చర్యలన్నీ కలిసి రావడంతో గత నెల రోజుల్లో వంట నూనెల ధరలు కేజిపై రూ. 8–10 తగ్గాయని ఎస్ఈఏ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఈ సారి దేశంలో సోయాబీన్ పంట విస్తీర్ణం 120 లక్షల టన్నులకు పెరిగిందని, వేరుశెనగ పంట విస్తీర్ణం అదనంగా 80 లక్షల టన్నులకు చేరుకుందని చతుర్వేది అన్నారు. ఆవాల ధరలు దిగొస్తాయని, ఈ సారి 77.62 లక్షల హెక్టార్లలో ఈ పంట వేశారని చెప్పారు. ఇది సాధారణం కంటే 30 శాతం ఎక్కువని, దీంతో రానున్న నెలల్లో ఆవనూనె తయారీ 8–10 లక్షల టన్నులు పెరగొచ్చని అంచనావేశారు. గ్లోబల్గా వంటనూనె ధరలు దిగొస్తున్నాయని చతుర్వేది అన్నారు. కాగా, ప్రస్తుతం మనం ఉపయోగించే వంటనూనెలో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇది 13–15 మిలియన్ టన్నులకు సమానం. గత రెండు మార్కెటింగ్ ఇయర్స్లో వంటనూనెల దిగుమతులు 13 మిలియన్ టన్నులకు తగ్గాయి.