
ప్రస్తుతం ప్లాస్టిక్ మయం. ఎక్కడ చూసినప్లాస్టిక్ కనిపిస్తుంది . కానీ వెనుకటి రోజుల్లోఇళ్లల్లో ఎక్కడ చూసిన రాగి పాత్రలే కనిపించేవి. అందుకే వెనుకటి రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవాళ్లు.ఇంతకు రాగినే ఎందుకు అన్నారో తెలుసా!రాగికి ఆంటీ బ్యాక్టీరియల్ నేచర్ఉంటుందట. రాగితో చేసిన పాత్రలలోసూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు. కాబట్టి ఇందులో వున్న పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం.
రాగి పాత్రల్లోని నీళ్ళు తాగితే, క్రిములు చేరేఅవకాశం చాలా అరుదు. అందుకే పాతరోజుల్లో రాగిబిందెలు వాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో రాగి పాత్రలు అన్నికొనలేము కానీ కనీసం ఒక చెంబు అయినమన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే రాగి పాత్రల వల్ల ఉపయోగాలున్నాయి. పూర్వం ఆడపిల్లలకు పెళ్లిచేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఇత్తడి, కంచు, రాగి సామాన్లు, వంట పాత్రలు, బిందెలు మొదలగు వస్తువులను సారె పెట్టేవారు. మనదేశంలో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. ఇదే విషయాన్ని పలు సర్వేలు కూడా స్పష్టం చేశాయి. అయితే మినరల్ వాటర్వల్ల శరీరంలో ఎముకల చుట్టూ ఉండేకాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవుతాయి. దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. రాగి, ఇత్తడి పాత్రలు ఎంతోమేలు అంటున్నారు చాలామంది.